మెరకముడిదాం మండలం గర్భాం రామమందిరం వద్ద, ఆదర్శ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన తాడ్డే తనూజ, ఆదర్శ జూనియర్ కళాశాలలో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన పవిత్రలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రాంమల్లిక్ నాయుడు సోమవారం ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వకారణమని తెలిపారు.