కుల, మత వర్గాలను విడగొట్టే మనస్తత్వం వైసీపీ పార్టీ దేనని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 2019లో ఎలా విద్వేషాలు రెచ్చగొట్టి వైసిపి అధికారంలోకి వచ్చిందన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి నేపథ్యంలో మతాలు మధ్య విధ్వంసం సృష్టించాలని వైసిపి ప్రయత్నించిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పై మాట్లాడే అర్హత వైసిపి నాయకులకు లేదన్నారు.