పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మాత్యులు కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాత్రి గంట్యాడలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు పెన్షన్ పెంపు పై రెండవ సంతకం చేశారని అన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.