మెంటాడలో పర్యటించిన సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్

85చూసినవారు
మెంటాడలో పర్యటించిన సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్
మెంటాడలో సమగ్ర శిక్ష విజయనగరం జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డా. ఎ. రామారావు బుధవారం పర్యటించారు. అంగన్వాడి కేంద్రాల్లో చదువుతున్న పిల్లలను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వ పాఠశాలలో చేరిక కోసం వారికి అవగాహన కల్పించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడులే ఉత్తమమైన మార్గమని తెలిపారు.

సంబంధిత పోస్ట్