వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో నిర్వహించే యువత పోరు కార్యక్రమానికి గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో నాయకులు బుధవారం విజయనగరం తరలి వెళ్లారు. అధికారం వచ్చాక కూటమి ప్రభుత్వం యువతను విస్మరించినందున జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేస్తామని అప్పల నరసయ్య చెప్పారు. నాలుగు మండలాల్లోని నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.