గజపతినగరం మండలంలోని గంగచోళ్ళపెంట గ్రామానికి చెందిన కర్రి సత్యనారాయణకు జాతీయ ఉత్తమ సేవా కార్యకర్త అవార్డు లభించింది. కోవిడ్ సమయంలో వైద్య సేవలందించినందుకు మధురైలోని అబ్దుల్ కలాం ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మమ్ముల తిరుపతిరావు ఆధ్వర్యంలో మెమెంటో, ధ్రువీకరణ పత్రాన్ని సోమవారం ఆయనకు అందజేశారు.