సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గంట్యాడ మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా దర్బార్ లో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు, మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడు పాల్గొన్నారు.