ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకొని రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. శనివారం బొండపల్లి మండలంలోని కొండకిండాం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే అభివృద్ధిపై దృష్టి పెట్టిందన్నారు. అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.