గజపతినగరంలోని శ్రీరామక్షేత్రం జంక్షన్ లో గల భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం వైభవంగా జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున ఆలయం అర్చకులు పిసపాటి శ్రీనివాసాచార్యులు సుప్రభాత సేవ ఆరాధన సేవా కాలం నివేదన ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులు ఉత్తర ద్వార దర్శనం ద్వారా బయటకు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు.