ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర పంటలు పండించవచ్చని కాలం రాజుపేట గ్రామ సర్పంచ్ గేదెల ఈశ్వరరావు అన్నారు. గురువారం గజపతినగరం మండలంలోని కాలం రాజుపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ ఈశ్వరరావు అధ్యక్షతన గ్రామసభ జరిగింది. పి ఎం డి ఎస్ ఉపయోగాలను రైతులకు వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఇద్దరు రైతులను సర్పంచ్ సత్కరించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.