గజపతినగరం మండలంలోని ముచ్చర్ల గ్రామంలో సోమవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చిన్నారులతో కోలాటం ఆడి నృత్యం చేశారు. డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు ముందు జరిగిన ఈ కార్యక్రమం అందర్నీ ఆకట్టుకుంది. ప్రజలు ఈ వేడుకలో పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.