గజపతినగరం: బీజేపీలో చేరిన విశ్రాంత డి.ఈ

60చూసినవారు
గజపతినగరం: బీజేపీలో చేరిన విశ్రాంత డి.ఈ
గజపతినగరం మండలం పురిటిపెంటకు చెందిన విశ్రాంత డి. ఈ దొగ్గ దేవుడునాయుడు బుధవారం బీజేపీలో చేరారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధ్వర్యంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ పురందేశ్వరి దేవుడు నాయుడుకి పార్టీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, నియోజకవర్గ నేత సరిది దుర్గాప్రసాద్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్