అతిగా మద్యం సేవిస్తే అనర్ధాలు కలుగుతాయని గజపతినగరం ప్రోహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జె. జనార్ధనరావు అన్నారు. శనివారం సాయంత్రం దత్తిరాజేరు మండలంలోని పెదమానాపురం సంతలో అవగాహన సదస్సు జరిగింది. మితిమీరిన మద్యం సేవిస్తే కలుగు అనారోగ్య సమస్యల గురించి వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కలిగే ప్రమాదాలు గురించి వివరించారు. ఎస్. ఐ నరేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.