గంట్యాడ మండలంలోని కొత్త వెలగాడ గ్రామంలో శ్రీకాళికామాత అమ్మవారి ఉత్సవాల చివరి రోజు ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. డప్పు వాయిద్యాలు భక్తుల శరణం ఘోష నడుమ భారీగా తరలివచ్చిన భక్తులంతా అమ్మవారి ఘటాలను శిరస్సున ధరించి ఆలయం నుంచి ప్రభలతో పురవీధుల మీదుగా అమ్మవారి ఘటాల ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గంట్యాడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.