రాష్ట్రంలో అభివృద్ధిని కేంద్రీకృతం చేయడానికి ప్రతి నియోజకవర్గంలో ఎం. ఎస్. ఎం. ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం గంట్యాడలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధి కల్పించడానికి సీఎం చంద్రబాబుఅధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రానున్న రెండేళ్లలో పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.