మెంటాడ మండల పరిషత్ కార్యాలయం దగ్గర 15 ఆర్థిక సంఘం నిధులు రూ. పది లక్షలతో సీసీ రోడ్డు పనులను ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు ప్రారంభించారు. ఎంపీపీ మాట్లాడుతూ.. మండలంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో మండల పరిషత్ కార్యాలయం దగ్గర సిసి రోడ్డు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో నిధులను మంజూరు చేశామన్నారు. పంచాయతీరాజ్ జేఈ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.