కొమరాడ మండలం మసిమండ పంచాయితీ జాకూరు గ్రామంలో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో సుమారు 400 మంది గిరిజనలు ఉన్నప్పటికీ గ్రామంలో ఒకటే చేతి బోరు ఉండటంతో ఇబ్బంది పడుతున్నట్లు మంగళవారం గిరిజనులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామానికి మరో బోరుబావి ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.