కురుపాం మండలంలోని మోండెంఖళ్లు ఉన్నత పాఠశాలలో పీసా గ్రామసభ ఎన్నికలను గురువారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గౌరీ శంకర్, ఎన్నికల అధికారి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో పీసా ఉపాధ్యక్షుడిగా రామకృష్ణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ గిరిజన హక్కులను కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు.