కురుపాం: బిటి రోడ్డుకు మరమ్మతు పనులు

76చూసినవారు
కురుపాం: బిటి రోడ్డుకు మరమ్మతు పనులు
కురుపాం మండలం అంటిజొల గ్రామం నుంచి మణిగ గ్రామానికి ఇటీవల వేసిన తారు రోడ్డు 20 రోజులు కాకముందే పెచ్చులూడింది. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయగా పలు మీడియాల్లో కథనాలు ప్రచురితం అయ్యాయి. వీటికి స్పందించిన పంచాయతీరాజ్ అధికారులు బుధవారం మరమ్మతులు చేపట్టారు. పంచాయతీరాజ్ ఈఈ రవి మాట్లాడుతూ పది రోజుల్లో నిర్మాణం పూర్తి చేసి అప్పగిస్తామన్నారని అప్పుడు వచ్చి నాణ్యత పరిశీలించాకే బిల్లు పెడతామన్నారు.

సంబంధిత పోస్ట్