దేశం కోసం వీరోచితంగా పోరాటం చేస్తున్న త్రివిధ దళాలకు ప్రజల తరపున సెల్యూట్ చేస్తున్నామని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. శుక్రవారం గుమ్మలక్ష్మీపురం క్యాంపు కార్యాలయంలో స్థానికులతో కలిసి త్రివర్ణ పతాకాలు చేబూని, భారత జవాన్లకు జయహో భారత్… జై జవాన్ అంటూ సెల్యూట్ చేశారు. క్లిష్ట పరిస్థితులలో శత్రువులకు దీటుగా ఎదురు నిలబడి సమాధానమిస్తున్న సైనికులకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని ఆమె కోరారు.