పార్వతీపురం: 200 లీటర్ల నాటుసారా పట్టివేత

50చూసినవారు
పార్వతీపురం: 200 లీటర్ల నాటుసారా పట్టివేత
పార్వతీపురం మండలం ఆర్ కె బట్టివలస గ్రామ వద్ద మంగళవారం ఎన్ఫోర్మెంట్ అధికారులు నాటుసారా పట్టుకున్నారు. బాలగుడబ గ్రామానికి చెందిన బంగారి, వెంకటరమణ గత కొద్ది రోజుల నుంచి ఆర్ కె బట్టివలస నుంచి నాటుసారా తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంకటరమణ కదలికలపై అధికారులు నిఘా ఉంచారు. మంగళవారం 200 లీటర్ల నాటుసారాను తరలిస్తుండగా అతని వద్ద నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్