బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు మన్యం జిల్లా, తోటపల్లి బ్యారేజీ వద్ద పెరిగిన నీటి ప్రవాహం క్రమేపి తగ్గుముఖం పడుతుంది. తోటపల్లి ప్రాజెక్టు వద్ద సోమవారం ఉదయానికి 105 మీటర్ల లెవెల్స్ గాను 103. 95 మీటర్ల లెవెల్స్ నీరు నిల్వ ఉంది. ఒడిశా నుంచి 1, 333 క్యూసెక్కుల నీరు రాగా రెండు గేట్లు ఎత్తివేసి 1, 175 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు.