గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట చెక్ పోస్ట్ వద్ద ఎస్సై శివప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని పలు వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. ఎస్సై మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు విధిగా లైసెన్స్, వెహికల్ రికార్డ్స్ కలిగి ఉండాలని, లేకుంటే జరిమానా విధిస్తామన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వాహన యజమానులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలిపారు.