భోగాపురం మండలం రావాడ గ్రామంలోని స్థానిక ఎస్సీ కాలనీలో అపారిశుద్ధ్యం తాండవిస్తోందని కాలనీ వాసులు శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీలోని సైడ్ కాలువల్లో పూడిక పెరిగి, దుర్గంధం వెదజల్లుతోందని వాపోతున్నారు. రాత్రి వేళల్లో దోమలు బెడద ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. తక్షణమే అధికారులు తమ కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని పొదినాల శీను తదితర కాలనీవాసులు కోరుతున్నారు.