భోగాపురం: కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు

385చూసినవారు
భోగాపురం: కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు
కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారు రాజు అన్నారు. భోగాపురం మండలం నందిగాంలో ఆదివారం జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్