కారు అద్దాలు పగలగొట్టారని పోలీసులకు ఫిర్యాదు

61చూసినవారు
కారు అద్దాలు పగలగొట్టారని పోలీసులకు ఫిర్యాదు
నెల్లిమర్ల పట్టణం జనసేన పార్టీ నాయకుడు రవ్వా నాగేంద్రవర్మ(నాని)కి చెందిన కారు అద్దాలను పగలగొట్టారని స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్డీయే కూటమి నాయకులు కడగల ఆనంద్ కుమార్, లెంక అప్పలనాయుడు తదితరులతో కలిసి నాని పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లిమర్ల పట్టణ, మండల రాజజీయాల్లో నాని చురుగ్గా పాల్గొంటున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్