నెల్లిమర్ల మండలంలోని సతివాడ, రామతీర్థం సబ్స్టేషన్ ల పరిధిలో నిర్వహణ పనులు జరుగుతున్న కారణంగా రేపు (సోమవారం) కొన్ని గ్రామాల్లో కరెంట్ కట్ ఉంటుందని టౌన్ డివిజన్ ఈఈ పి. త్రినాథ్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పినతరిమి, పెదతరిమి, బొప్పడం, వల్లూరు, బుచ్చన్నపేట, ఒమ్మి, మల్యాడ గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు.