ప్రతీ నియోజకవర్గంలో ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రంలోని మొట్టమొదటి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్కు నెల్లిమర్ల మండలం సారిపల్లి వద్ద శుక్రవారం శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు.