నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని రామతీర్థం జంక్షన్ లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెప్మా బజారు ఆ విభాగం పీడీ చంటి రాజు శుక్రవారం సందర్శించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రదర్శించిన వస్తువులను తిలకించారు. మహిళలు ఆదాయం పెంచుకుని, ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అప్పలరాజు, మెప్మా సీఎంఎం గోవిందరావు పాల్గొన్నారు.