పూసపాటిరేగ మండలం గోవిందపురంలో ఉన్న అనధికార మద్యం దుకాణంపై శనివారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా 16 మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతిలేని మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ రవికుమార్ తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ చంద్రమోహన్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ శిరీష పాల్గొన్నారు.