నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ గా తారకనాథ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురం మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారిగా పనిచేసిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించిన అప్పలరాజుకు ఇంతకుముందే విజయనగరం కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ గా బదిలీ అయిన విషయం తెలిసిందే. విధుల్లో చేరిన తారకనాథ్ ను అప్పలరాజు, సిబ్బంది అభినందించారు.