సీతంపేట తాసిల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించినట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు తెలిపారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసి , స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి మినిమం రూ. 26, 000 జీతం పెంచాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వ్యవసాయ ఉద్యోగస్తులు పెండింగ్ జీతాలు సకాలంలో చెల్లించడంతోపాటు వివిధ డిపార్ట్మెంట్ లలో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని అన్నారు.