ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శనివారం ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా సమావేశంలో ఆసుపత్రి పరిధిలో చెపట్టాల్సిన పనులు, ఖర్చు చేయాల్సిన నిధులు, ఇతరాత్ర అంశాలపై చర్చించారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు హాజరయ్యారు.