పాలకొండ: జనసేనలో చేరిన వైసీపీ కౌన్సిలర్

56చూసినవారు
పాలకొండ: జనసేనలో చేరిన వైసీపీ కౌన్సిలర్
పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని 10వ వార్డు కౌన్సిలర్ కొంచాడ సరోజిని ఎమ్మెల్యే జయకృష్ణ సమక్షంలో శనివారం జనసేన పార్టీలో చేరారు. వైసీపీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన సరోజిని తాజాగా తన భర్త కొంచాడ అరుణకుమార్ మరో 50 మంది కార్యకర్తలతో జనసేనలో చేరారు. అభివృద్ధిని ఆకాంక్షించే తాను పార్టీ మారినట్లు ఆమె తెలిపారు. వైస్ ఎంపీపీ అనిల్, కూటమి నాయకులు శ్రీధర్, నవీన్, జానీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్