సీతానగరం మండలంలో కొత్తవలస గ్రామ సర్పంచ్ రెడ్డి అనిత చేతులు మీదుగా నూతన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంను ఆదివారం ప్రారంభించారు. తడిచెత్త, పొడిచెత్తను విడివిడిగా సేకరించి, వాటి ద్వారా సేంద్రీయ ఎరువులు తయారు చేస్తారని తెలిపారు. రైతులు ఆ ఎరువులని వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సెక్రటరీ, మాజీ సర్పంచులు అప్పారావు, వాసుదేవ రావు, రెడ్డి సత్యం, గ్రామ పెద్దలు గ్రీన్ అంబాస్సిడిర్స్ పాల్గొన్నారు.