వేద పండితుల నిరుద్యోగ భృతికి దరఖాస్తులు ఆహ్వానం

78చూసినవారు
వేద పండితుల నిరుద్యోగ భృతికి దరఖాస్తులు ఆహ్వానం
వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులు నిరుద్యోగ భృతికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మన్యం జిల్లా దేవాదాయ ధర్మాదాయ సహాయ కమిషనర్ కేఎల్ సుధారాణి శుక్రవారం తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 26 వరకు గడువు ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి కలవారు తమ దరఖాస్తులను జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్