బందలుప్పి: యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి

73చూసినవారు
బందలుప్పి: యోగాను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి
ప్రస్తుత జీవన విధానంలో యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలని డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్. భాస్కరరావు అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా బాలగుడబ గ్రామంలో శనివారం యోగా సెషన్ నిర్వహించి అవగాహన కల్పించారు. గ్రామస్తులతో కలిపి యోగాసనాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు, వైద్యాధికారి తిరుమలప్రసాద్, వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్