భామిని మండలం పాత బిల్లుమడ సమీపంలోని తోటలలో బుధవారం సాయంత్రం ఏనుగుల గుంపు ప్రవేశించడంతో గ్రామాల్లో కలకలం రేగింది. జీడి, మామిడి, మొక్కజొన్నతో పాటు పలు పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పంట నష్టం తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఏనుగులను తొలగించాలంటూ స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.