పాచిపెంట మండలం కర్రివలస గ్రామంలో గురువారం ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. స్థానిక పంచాయతీ కార్మికులు జయరాం తదితరలు పలు కాలనీలలో కాలువలలో పూడికలు తొలగిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి పి. శివ మాట్లాడుతూ ప్రజలు చెత్తను కాలువలలో వెయ్యకుండావేయకుండా తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ఉంచాలన్నారు. ప్రజలు సహకరించినప్పుడే స్వచ్ఛ పంచాయతీగా తీర్చిదిద్దవచ్చు అన్నారు.