మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో విష జ్వరాలు వీడటం లేదు. విద్యార్థుల నుంచి పెద్దల వరకు జ్వరాల బారిన పడుతున్నారు. సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉండడంతో చిన్నారులు, వృద్ధులపై ప్రభావం చూపుతున్నాయి. వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, కాళ్ల పీకులు, తలనొప్పి వంటి లక్షణాలతో గిరిజనులు బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు.