బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని లోక్ అదాలత్ సభ్యుడు ప్యానల్ అడ్వకేట్ టి. జోగారావు అన్నారు. బుధవారం తాళ్ళబురిడీ జిల్లా పరిషత్ హైస్కూల్లో బాల్య వివాహాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల చట్టం నిషేధం చేసిందని గుర్తు చేశారు.