పార్వతీపురం మండలం డికె పట్నం గ్రామ సచివాలయ ఆవరణంలో పార్వతీపురం లయిన్స్ క్లబ్, నేతృత్వంలో మెగా మెడికల్ క్యాంపు శుక్రవారం నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో పార్వతీపురంలో ప్రముఖ వైద్యులు, శ్రీకాకుళం రాజోలు జెమ్స్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న నిరు పేద గిరిజన ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా మెడికల్ క్యాంపు ను నిర్వహించడం జరిగిందని అన్నారు.