వ్యవసాయ, అనుబంధ రంగాల్లో లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఏటా 15 శాతం కంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. జిల్లాలో ఏటా 2.20 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న పాల దిగుబడి ఈ ఏడాది మరింతగా పెరగాలి. గోశాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. మత్స్య సంపదను పెంచాల్సి ఉంది. జీడి, పసుపు, పైనాపిల్, పామాయిల్ ఇతర అంతర పంటలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. గొర్రెలు, పశువులు, కోళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించాలి.’ అని తెలిపారు.