పార్వతీపురం: ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు

68చూసినవారు
పార్వతీపురం: ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు
పార్వతీపురం పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో ఎస్‌.భాస్కరరావు ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో యూపీహెచ్‌సీ వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి సేవలు, నెలవారీ నివేదికలు , ఓపీ వివరాలు, ల్యాబ్‌ పరీక్షలు, మందులు, ఈహెచ్‌ఆర్‌ నమోదుపై చర్చించారు. ఆరోగ్య వివరాలు ఆయుష్మాన్‌ భారత్‌ ఐడీతో అనుసంధానమై ఉండాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్