భారత రాజ్యాగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ జయంతి సోమవారం నిర్వహిస్తున్నట్లు మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉ. 10 గం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళితో కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందన్నారు. అనంతరం సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు.