బలిజిపేట మండలం జనార్ధనవలస వద్ద 2300 కేజీల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. శ్రీకాకుళం విజిలెన్స్ ఎస్పి బి. ప్రసాదరావుకు అందిన ముందస్తు సమాచారం మేరకు రేషన్ బియాన్ని అక్రమంగా ఒడిశాకు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఈ వాహనం, బియ్యం యజమాని అయిన వంగర మండలం లక్ష్మీంపేటకు చెందిన ఆవు చిన్నంనాయుడుపై క్రిమినల్ కేసు పెడుతున్నట్లు విజిలెన్స్ ఎస్ఐ రామ్మోహనరావు తెలిపారు.