పార్వతీపురం: నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే బోనెల

68చూసినవారు
పార్వతీపురం: నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే బోనెల
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు అంకితభావంతో పనిచేస్తూ వేతనదారులకు పనులు కల్పించాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మన్యం జిల్లా ఉపాధి హామీ పీడీ కార్యాలయం నుంచి జారీ అయిన నియామక పత్రాలను స్థానిక టీడీపీ కార్యాలయంలో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్