న్యాయస్థానాలలో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడానికి, వివాదాలను ముందు దశలోనే పరిష్కరించడానికి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండవ అదనపు. మన్యం జిల్లా జడ్జి మండల న్యాయ సేవా కమిటి అధ్యక్షులు ఎస్. దామోదర రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి మే 10వ తేదీన మొదటి జాతీయ లోక్ అదాలత్ జిల్లా కోర్ట్ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.