పార్వతీపురం మన్యం జిల్లా మంచి ప్రతిభ గల నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నారని, వారందరికీ వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆయా సంస్థల అధినేతలను కోరారు. శుక్రవారం స్థానిక భాస్కర్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పార్వతీపురం మన్యం జిల్లా వారి ఆధ్వర్యంలో వివిధ కంపెనీల వారు జాబ్ మేళా నిర్వహించారు.