పార్వతీపురం: ఆటో.. ట్రాక్టర్ ఢీ.. పదిమంది మహిళలకు గాయాలు

75చూసినవారు
పార్వతీపురం: ఆటో.. ట్రాక్టర్ ఢీ.. పదిమంది మహిళలకు గాయాలు
పార్వతీపురం మన్యం సీతానగరం మండలం కాశీ పేట డాబా వద్ద గురువారం ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఆటోలో ఉన్న పదిమంది మహిళలకు గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం మండలం రంగంపేట గ్రామానికి చెందిన మహిళలు బ్యాంక్‌కు వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. గాయపడినవారికీ బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్